Thursday, April 25, 2024

పోలీస్ స్నైపర్ డాగ్ మృతి… అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు..

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ స్నైపర్ డాగ్ (టైసన్) అనారోగ్య కారణాలతో మృతి చెందింది. బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణతో పాటు జిల్లాలోని పోలీసు అధికారులు డాగ్ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ డాగ్ 2015 నుండి కమిషనరేట్ లో సేవలందిస్తున్నది. మానేరు డ్యామ్ తీరంలో అధికారిక లాంచనాలతో అంతక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిపి శ్రీనివాస్ అడిషనల్ డీసీపి, చంద్రమోహన్, ఏఆర్ ఏసిపి సి ప్రతాప్, ఆర్ఐ లు కిరణ్ కుమార్ రమేష్, మల్లేశం, సురేష్, పశు వైద్యాధికారి నరేష్ రెడ్డిలతో పాటుగా ట్రైనర్ రాజులతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement