Saturday, April 20, 2024

పోలీసులు జవాబుదారీతనంతో పని చేయాలి.. పెద్దపల్లి ఇన్​చార్జి డీసీసీ అఖిల్..

పోలీసులు జవాబుదారీతనంతో పనిచేయాలని పెద్దపల్లి ఇన్చార్జి డి.సి.పి అఖిల్ మహాజన్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సుల్తానాబాద్, పోత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ఉండాలన్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తే గుర్తింపు పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్, అశోక్ రెడ్డి, లక్ష్మణ్, వెంకటేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement