Thursday, April 25, 2024

అమ‌రుల‌ త్యాగం వృథాపోనివ్వమ‌న్న పెద్ద‌ప‌ల్లి డీసీపీ ర‌వీంద‌ర్‌

Peddapally: పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే ప్రస్తుతం సమాజంలో శాంతి నెలకొని ఉందని పెద్దపల్లి డీసీసీ రవీందర్ పేర్కొన్నారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల రక్షణలో భాగంగా ఎందరో పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ అశోక్ తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement