Wednesday, April 24, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే : పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టంతో కనెక్ట్ చేశామని వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ ట్రిపుల్ రైడింగ్ చేసిన, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిగ్గా ఈ చాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు. వాహనదారులు కచ్చితంగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement