Thursday, April 25, 2024

మంథని పై పెద్దపల్లి జట్టు విజయం

రామగుండంపై గెలుపొందిన గోదావరిఖని టూ టౌన్
పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. బుధవారం మొదటి మ్యాచ్ లో రామగుండం జట్టుపై గోదావరిఖని టూ టౌన్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లో మంథని జట్టు పై పెద్దపల్లి జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మంథని జట్టు 10.1 ఓవర్ లలో 51 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. పెద్దపల్లి జట్టు 6.4 ఓవర్ లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 52 రన్స్ చేయడంతో ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ప్రతిభ కనబరిచిన సుందర్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి రూపేష్, ఏసీపీలు గిరిప్రసాద్, సారంగపాణి, సిఐలు సతీష్, ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, రమేష్, చంద్రశేఖర్, వేణుగోపాల్ తో పాటు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement