Thursday, April 25, 2024

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం : పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్

శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు. శనివారం డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన డీసీపీకి గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమేష్ బాబు తోపాటు ఎస్సైలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement