Wednesday, April 24, 2024

ఒలంపియాడ్‌లో ట్రినిటి విద్యార్థుల ప్రభంజనం.. అభినందించిన చైర్మన్‌

శ్రీనివాస రామానుజ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపియాడ్‌ పరీక్షా ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఒలంపియాడ్‌ పరీక్షా ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఫస్ట్‌, సెకండ్‌, జిల్లా ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంకులు దక్కడం విశేషం. ర్యాంకుల పంట పండించిన విద్యార్థులను ట్రినిటి విద్యా సంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి అభినందించి బహుతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దాసరి మమత రెడ్డి హాజరై విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో పి. కృతిక్‌, కె. రక్షిత, ఖాజా అక్మల్‌, సీహెచ్‌. నేత్ర, జిల్లాస్థాయిలో కె.శాన్వీ, పి.ఆదిత్య, వరుణ్‌ తేజ్‌, జి.గుణ, శ్రీహితి, ప్రణవ్‌ కుమార్‌, సంకీర్తన, కె. మోక్షిత, ముక్తేశ్వర్‌, జీ. రక్షిత, సహస్త్ర, సింధు ప్రియ, సుమేథ్‌ ర్యాంకులు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement