Saturday, April 20, 2024

ఆదర్శ నియోజకవర్గంగా పెద్దపల్లి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాన‌ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలో బొంపల్లి రాగినేడు మీదుగా కుర్మపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పెద్దపల్లిఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలో బొంపల్లి రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు 2.48 కోట్ల రూపాయల పిఎంజీ ఎస్ వై నిర్మించతలపెట్టిన తార్ రోడ్డు పనులను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ గత పాలకుల హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైనేజీల తో ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో లింకు రోడ్లు పూర్తి చేశామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement