Wednesday, March 27, 2024

పాలాభిషేకం..

ఇల్లంతకుంట: అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇల్లంతకుంట మండల సమస్యలపై సభ దృష్టికి తీసుకెళ్లడం పట్ల తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. మిడ్‌ మానేరు కింద వల్లంపట్ల, వెల్జీపూర్‌, ఓగులాపుర్‌, గూడెపు పల్లె, ముస్కుపల్లె, చీర్లవంచ గ్రామాల రైతులు భూమిని కోల్పోయారని, ఎగువ భాగాన ఉన వారికి కాలువల ద్వార నీరందించే సౌకర్యం లేనందునే లిప్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు- చేసి చెరువులను నింపడం ద్వారా గామాల రైతులకు 5వేల ఎకరాలకు సాగునీరందించాలని కోరడం పట్ల కృతజ్ఞతలు ఎలిపారు. ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడంతో సానుకులంగా స్పందించడం పట్ల ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌,పీఏసీఎస్‌ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతు సంఘ సభ్యులు, నాయకులు, రైతులు సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement