Thursday, April 25, 2024

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

పెద్దపల్లి రూరల్: మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపట్ల పెద్దపల్లి ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. స్ధానిక ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పంచాయితీకి రూ.10 లక్షలు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్పంచులు, ఎంపీటీసీలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రాంమూర్తి, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, అప్పన్నపేట విండో ఛైర్మన్ దాసరి చంద్రారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు హాబీబ్ ఉర్ రహమాన్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement