Thursday, March 28, 2024

టీఆర్ఎస్ గెలుపును ఎవ‌రు ఆపలేరు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం గర్వించే మహనేత సీఎం కేసీఆర్‌ అని ప్రతి ఇంటికీ సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసమే కాంట్రాక్టుల కోసం మునుగోడులో ఉపఎన్నిక తెచ్చరన్నారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బారినపడి ప్రజలంతా అనారోగ్య కష్టాలు పడుతుంటే నాటి ప్రభుత్వాలు పట్టించికోలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథ‌కం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చారన్నారు. తెలంగాణ ను అన్ని రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రం గా తీర్చిదిద్దారన్నారు. ఇంకో సంవత్సరం పాటు పదవీ కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్య వంతులైన మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement