Friday, March 29, 2024

నిధుల వినియోగానికి నూతన టెక్నాలజీ

  • ఎంపీపీలకు డిజిటల్‌ కీ అందజేత

పెద్దపల్లి : మండల పరిషత్‌, గ్రామపంచాయతీలకు మంజూరయ్యే నిధుల వినియోగం నూతన టెక్నాలజీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ఎంపీపీలకు చెక్‌ పవర్‌ ఇచ్చిన సందర్భంగా పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌కు జడ్పీ చైర్మన్‌ మధు డిజిటల్‌ కీని అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ కీని ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement