Friday, March 29, 2024

నర్సింగరావు మృతి తీరనిలోటు : బాల్క సుమన్

తెరాస సీనియర్ నాయకులు బోయినపల్లి నర్సింగరావు మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన క్యాతనపల్లి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయినపల్లి నర్సింగరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement