Thursday, April 25, 2024

రోడ్డుకు అడ్డంగా చెట్ల తొలగింపు..

ముత్తారం: మండలంలోని అడవి శ్రీరాంపూర్‌- ముత్తారం మార్గమధ్యంలో కురిసిన వర్షానికి చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులను వివరించడంతో వెంటనే స్పందించిన ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ వార్డుమెంబర్లు అశోక్‌, ఉపేందర్‌ లతో కలిసి రోడ్డుపై పడ్డ చెట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు లక్క ప్రభాకర్‌, యూత్‌ సభ్యులు లక్కం రాజు, నాంసాని రాజు, ఎడ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement