Thursday, April 25, 2024

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత..

సుల్తానాబాద్‌: హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు బాధ్యత తీసుకోవాలని ఎంపీడీఓ గంగుల సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని గర్రెపల్లి, భూపతిపూర్‌ గ్రామాల పరిధిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలతోపాటు ప్రకృతి వనాలను సంరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సరీలో నాటిన మొక్కలను రానున్న వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం మొక్కలకు నీరు పట్టారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ వీరగోని సుజాత రమేశ్‌ గౌడ్‌, ఎంపీటీసీ పులి అనూషతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement