Saturday, April 20, 2024

పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి హత్య చేసిన తల్లి

కన్న కొడుకునే బోరుబావిలో పడేసి కసాయి తల్లి చంపేసింది. ఈ అమానవీయ ఘటన పెద్దపల్లి జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొగల్‌పురాలో నివాసముంటే శ్యామల గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నది. కొడుకు బన్నీ (14)ను సహజ కాలేజీ దగ్గరలోని వ్యవసాయ బావిలో తోసి వేసింది. అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. అయితే, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బావిలోకి తోసివేసినట్లు పేర్కొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. ఎస్ఐ రాజేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement