Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి.. బీఆర్ఎస్ నాయకుడు మృతి

జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రంలో పాల్గొనేందుకు వచ్చారు. పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. నిజాంబాద్ రోడ్ లోని గాంధీనగర్ నుంచి ఎమ్మెల్సీ కవితకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద నృత్యం చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ బండారు వాణి భర్త బండారు నరేందర్ కింద పడిపోయాడు. గమనించిన బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. నరేందర్ గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement