Thursday, April 25, 2024

అన్నదాతకు అండగా ప్రభుత్వం: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

కేంద్ర ప్రభుత్వం ముఖం చాటేసినా అన్నదాతకు అండగా నిలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. నిరంతరం అన్నదాత కోసమే ఆలోచించే పాలకుడిగా కేసీఆర్‌ తనదైన ముద్ర వేశారని, తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని ప్రకటించినా రైతుల కష్టం దూరం చేసేందుకు కొనుగోళ్లను ప్రారంభించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement