Saturday, April 20, 2024

భాజాపాలో చేరిన మైనార్టీలు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొంతమంది ముస్లిం మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్‌ వద్ద జిల్లా అధ్యక్షులు ప్రతాప్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ముస్లిం సోదరులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను తమ ఓటు- బ్యాంకు కోసం వినియోగించుకుంటు-న్న రాజకీయ పార్టీలను రాబోయే రోజుల్లో నమ్మే ప్రసక్తి లేదన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌, పట్టణ అధ్యక్షులు సంతోష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement