Friday, April 19, 2024

ఎంఈవో రాజయ్యకు నివాళి..

ఎల్లారెడ్డిపేట: మండల విద్యాధికారి మంకు రాజయ్య కరోనాతో మృతిచెందడం పట్ల తెలంగాణ వివేక రచయితల సంఘం నివాళులర్పించారు. మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను తెవిరసం అధ్యక్షులు డాకట్ర్‌ వాసరవేని పరశరాములు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్‌, ఎండీ దస్తగిర్‌, రాములు పాల్గొన్నారు. అలాగే డాక్టర్‌ కేవీఆర్‌ హైస్కూల్‌లో ఎంఈవో రాజయ్యకు నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement