Thursday, April 25, 2024

విద్యాభివృద్ధిపై నిబద్ధత కలిగిన ఎంఈవో రాజయ్య..

ఎల్లారెడ్డిపేట: కరోనా కారణంగా అకాల మృతిచెందిన ఎంఈవో మంకు రాజయ్య ప్రభుత్వ విద్యాభివృద్ధికి సామాజిక బాధ్యతతో నిబద్ధత కలిగిన అధికారిగా పని చేశారని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కందుకూరి రమణ పేర్కొన్నారు. అందరికి సమానమైన, ఒకే రకమైన గుణాత్మక విద్య అందించాలన్న విశ్వాసంతో ముందుకు సాగారన్నారు. జిల్లాలో, మండలంలో ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమం కోరుకునే వారి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. ఆయన సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, అనేక అవార్డులు కూడా పొందారని, ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement