Friday, April 26, 2024

మాస్కులు లేకుంటే జరిమానా..

మెట్‌పల్లి: కరోనా విజృంభిస్తున్నందున మాస్కులు లేని వారికి జరిమానాలు తప్పవని మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ రొడ్డ యాదగిరి పేర్కొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌లో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తులకు, షాప్‌ యజమానులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 25 మందికి రూ. 25 వేలు జరిమానా వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ ఉమాదేవి , జూనియర్‌ అసిస్టెంట్‌ సంధ్య రాణి, టిఓ నరేష్‌, సానిటరీ ఇన్స్పెక్టర్‌ టి రమేష్‌, ముజీబ్‌, ధర్మేందర్‌, జి రమేష్‌, సోమిడి శివ నాయక్‌, బిల్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement