Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

తిమ్మాపూర్‌ : తిమ్మాపూర్‌ మండలం శ్రీచైతన్య కాలేజీ ఎదురుగా రాజీవ్‌ రహదారి ప్రధాన రోడ్డుపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు- చేసుకుంది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టి వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాయపడ్డ వ్యక్తి బెజ్జంకి మండలం చీమలకుంట పల్లికి చెందిన అశోక్‌ గా స్థానికులు గుర్తించారు. బెజ్జంకి నుండి కరీంనగర్‌ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్‌ఎండి ఎస్‌ఐ ప్రమోద్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement