Thursday, April 25, 2024

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..

ముత్తారం: రైతుల ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు లభిస్తుందని సింగిల్‌ విండో చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి, ఎంపీపీ జక్కుల ముత్తయ్యలు పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా మద్దతు ధర పొందాలని కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరంతో ధాన్యం విక్రయించాలని కోరారు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయ సమితి- అధ్యక్షులు అత్తె చంద్రమౌళి, సీతంపేట సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు ఓదెలు, నాంసాని సమ్మయ్య, డైరక్టర్‌ ఓదెలు, తెరాస గ్రామ అద్యక్షులు మల్లేష్‌, యూత్‌ అధ్యక్షులు లక్కెపురం నరేష్‌, తెరాస నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement