Thursday, April 25, 2024

పేదలకు వరం సీఎం సహాయనిధి

జూలపల్లి: పేద ప్రజలకు ఆపద సమయంలో సీఎం సహాయనిధి వరంలా ఆదుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మండలంలోని అబ్బాపూర్‌కు చెందిన సీపెల్లి శ్వే అనారోగ్యంతో బాధ పడుతూండగా సీఎంఆర్‌ఎఫ్‌ కోసం మంత్రి కొప్పులకు విన్నవించుకుంది. దీంతో స్పందించిన మంత్రి ఈశ్వర్‌ నిమ్స్‌ ఆస్పత్రి నుంచి మంజూరైన రూ. 2.50లక్షల ఎల్‌ఓసీ చెక్కును హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శ్వేత తండ్రి అంజయ్యకు అందజేశారు. పేదలను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement