Friday, April 26, 2024

కిడ్నాప్ కథ సుఖాంతం..పేరేంట్స్ చెంతకు చిన్నారులు.

కరీంనగర్ . .. రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన చిన్నారుల కథ సుఖాంతమైంది.. మహారాష్ట్ర నుంచి చిన్నారులు
కరీంనగర్‌కు చేరుకున్నారు. అనంతరం ఆ చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.. వివరాలలోకి వెళితే, చిన్నారులు అక్షిత, లోకేశ్‌కు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి రెండు రోజుల క్రితం కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు చిన్నారులతో రైలెక్కి వృద్ధురాలు జయశ్రీ ఔరంగాబాద్ తీసుకెళ్లింది.

కాగా జాల్నా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు చిన్నారులను జయశ్రీ కొట్టింది. అనుమానంతో పిల్లలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించగా కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది. వెంటనే మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు పిల్లలు తమ అదుపులోనే సురక్షింతంగా ఉన్నారని చిన్నారుల కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.. దీంతో లోకల్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడి చిన్నారులను కరీంనగర్ కు తీసుకొచ్చారు..కిడ్నాప్ చెర నుంచి తమ ఇంటికి చిన్నారులు చేరినందుకు చిన్నారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement