Friday, March 29, 2024

డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన కేకన్ సుదీర్ రాంనాథ్

మంచిర్యాల జోన్ నూతన డీసీపీగా కేకన్ సుధీర్ రాంనాథ్ బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జోన్ కు చెందిన పోలీస్ అధికారులు డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు ప్రజలంద‌రి సపోర్టు అవసరమ‌న్నారు. నేరాలు జరగకుండా తగు చర్యలు తీసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, అందుకు ప్రజల సపోర్టు ఉండాలనీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ వారికి తెలియజేయాలన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదని డీసీపీ అన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనరు కలిసి పుష్పగుచ్చాలను అందజేసిన వారిలో బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, జైపూర్ ఏసీపీ నరేందర్ లు, మంచిర్యాల పట్టణ ఇన్ స్పెక్ట‌ర్ నారాయణ, మందమర్రి సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ ప్రమోద్ కుమార్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement