Friday, March 29, 2024

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగార‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు పూర్త‌య్యింద‌న్నారు. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేసుకున్నారు. చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29 తేదీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్బంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో పార్టీ నాయకుకతో కలసి కేసీఆర్ భారీ కటౌట్ కు క్షిరాభిషేకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement