Wednesday, April 24, 2024

పేదల జీవితాల్లో కంటి వెలుగు.. మంత్రి ఈశ్వర్

పెద్దపల్లి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలోని ఐటిఐ ఆవరణలో గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఆనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాలు ఇస్తామని, ఆపరేషన్ లు అవసరమున్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, కమీషనర్ శ్రీనివాస రెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement