Thursday, April 18, 2024

పేదంటి ఆడ పిల్లలకు వరం కల్యాణ లక్ష్మి : గంగుల కమలాకర్

పేదింటి ఆడపిల్లల పాలిట కల్యాణ లక్ష్మి పథకం వరం లా మారిందని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్
చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా విస్తరించాలని టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు తోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement