Saturday, April 20, 2024

నిరుపేద ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి… ఎమ్మెల్యే దాసరి

పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో 42మంది లబ్ధిదారులకు 42,04,872 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి-మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక-రాజనర్సు, ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండాల్ రెడ్డి, కో ఆప్షన్ ఖాలీల్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, యూత్ అధ్యక్షులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement