Saturday, April 20, 2024

క‌రీంన‌గ‌ర్ లో క‌ళోత్స‌వాలు.. అక్టోబర్ 2న చిరంజీవి రాక : మంత్రి గంగుల

కరీంనగర్‌లో కళోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2 తేదీలలో ఈ ఉత్స‌వాలు జరుగుతాయని, చివరి రోజున మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని తెలిపారు. దసరా, బతుకమ్మ పండుగలకు వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు, ఇతర విభిన్న వర్గాలు సొంత జిల్లాకు చేరుకుంటారు. స్థానికంగా ఉండే వారితో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారికి కనులవిందు చేసేందుకు కరీంనగర్ జిల్లా వేదికగా కళోత్సవాలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్‌ నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగంతో చర్చించారు. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30తో పాటు అక్టోబర్‌ 1, 2 తేదీల్లో అంటే మూడు రోజుల పాటు ఈ వేడుకలుంటాయి. వీటిని ఆషామాషీగా కాకుండా ఉమ్మడి కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాకు చెందిన కళాకారులు, అలాగే, దేశంలోని 29 రాష్ర్టాల నుంచి విభిన్న కళాకారులను ఆహ్వానిస్తున్నారు. మొదటి రోజు మంత్రి కేటిఆర్ పాల్గొని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement