Wednesday, April 24, 2024

మహనీయులు ఆచార్య జయశంకర్‌.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు ఆచార్య కొత్తపల్లి శంకర్‌ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ… 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు జయశంకర్‌ సార్‌ చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు. తెరాస పార్టీ సిద్దాంతకర్తగా ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో జయశంకర్‌ సార్‌ కీలకపాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతీ తెలంగాణ బిడ్డ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement