Friday, March 29, 2024

జగ్జీవన్‌ రామ్‌ జయంతి

కోరుట్లరూరల్‌: మండలంలోని చిన్న మెట్‌పల్లి గ్రామంలో సోమవారం బాబు జగ్జీవన్‌ రామ్‌ 114 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోరుట్ల జెడ్‌పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్‌ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సే వలను కొనియాడారు. ఈకార్యక్రమంలో మాదాపూర్‌ సర్పంచ్‌ రాజేష్‌, చిన్న మెట్‌పల్లి సర్పంచ్‌ నూతిపెళ్లి గంగరాజు, ముత్తయ్య ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీ-సీ విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బండి భూమయ్య, మాజీ జెడ్పిటిసి కొంతం రాజు రాజాం, వార్డు సభ్యులు బొల్లి బాబు, దేశవీని రాజేష్‌, తిరుపతి, నాయకులు హరీష్‌, గంగాధర్‌, నరేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement