Friday, March 29, 2024

ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్‌ యాదవ్‌, సర్పంచ్‌ ఫోరం అధ్యక్షుడు కళాల రాజిరెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు కనుమల్ల గణపతి, ఆలయ కమిటీ- చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డితో పాటు- ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement