Tuesday, April 16, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తాం : మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌

కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరంగల్ రాహుల్ సభ రైతు డిక్లరేషన్ వివరాలను స్థానికులకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని వెళ్ల‌డించారు. రైతు బంధు మొత్తాన్ని 15 వేలకు పెంచుతామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామన్నారు. అనంత‌రం పొన్నం ప్రభాకర్ స్థానికులతో ముఖాముఖి నిర్వహించి రైతుల సమస్యలు అడిగి తెలుసున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement