Saturday, April 20, 2024

నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు.. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి

గణపతి నిమర్జనం ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నిమజ్జనం జరిగే మినీ ట్యాంక్బండ్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ శోభాయాత్ర జరిగే పట్టణంలోని పలుకూడాలలో పికెటింగ్ లు ఏర్పాటు చేశామన్నారు.

శోభాయాత్ర తో పాటు నిమజ్జనోత్సవం లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి తో పాటు ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement