Friday, March 29, 2024

హుజూరాబాద్ లో భారీ పోలీస్ బందోబ‌స్తు

కరింనగర్ జిల్లా హుజురాబాద్ అంబేడ్కర్ చౌక్ వద్ద శుక్రవారం ఉదయం నుండి పోలీసులు భారీగా మోహరించారు. హుజురాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన నేపథ్యంలో గురువారం ఈ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం భారీగా పోలీసులు మోహరించారు. హుజురాబాద్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement