Saturday, April 20, 2024

ఎల్లయ్యకు చేయూత

రుద్రంగి: క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేని ఎల్లయ్యకు దుబాయి రుద్రంగి సంఘం ఆధ్వర్యంలో సోమవారం రూ. 10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకొని తమ వంతుగా ఆర్థికసాయం చేసినట్లు- తెలిపారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి ఎల్లయ్యకు సాయమందించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో సంఘ నాయకులు దారిశెట్టి బాలకిషన్‌, బొల్లి కుమార్‌, చెలుకల గంగాధర్‌, నాగులపెళ్లి చిన్నారెడ్డి, బొల్లి కొమురయ్య, గంగం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement