Thursday, April 25, 2024

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కరీంనగర్ లోని పోలీసు శిక్షణ కళాశాల లో హెడ్ కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్న వరంగల్ జిల్లా పర్వతగిరి హెడ్ కానిస్టేబుల్ రాజ నరేందర్ (50) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ కమిషనరేట్ నుండి వచ్చి శిక్షణ పొందుతున్నారు.

శిక్షణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజ నరేందర్ గతంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ శిక్షణకు వచ్చారు. శిక్షణలో భాగంగా కఠిన తరమైన అంశాలు ఉండవని, వయస్సును దృష్టిలో ఉంచుకొని సాధారణ అంశాల్లోనే శిక్షణ కొనసాగుతున్నదని పిటిసి అధికారులు పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ రాజ నరేందర్ ను కరీంనగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. రాజ నరేందర్ పార్థివ దేహాన్నిఅపోలో మార్చురిలో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement