Thursday, March 28, 2024

నిరుపేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే దాసరి

123 లబ్ధిదారులు.. రూ.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పెద్దపల్లి నియోజకవర్గం లోని 123 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 55,25,500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని గత నాలుగెల్లుగా వేలాది మందికి కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందాల ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గర్భిణీలకు సౌకర్యంగా ఉండేలా మాతా శిశు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, కెసిఆర్ కిట్ పథకం ప్రారంభమైన అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్య పది రేట్లు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement