Tuesday, April 23, 2024

ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. కరీంనగర్ టూ యాదాద్రి బస్సు సౌకర్యం

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు, మేయర్ యాదగిరి సునీల్ రావు కోరిక ప్రకారం నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ నుండి యాదగిరి గుట్టకు నూతన బస్సు సౌకర్యాన్ని కల్పించింది. గత కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామీ భక్తుల కోసం మేయర్ యాదగిరి సునీల్ రావు ఆర్టీసీ సంస్థకు విన్నవించగా… మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం ఆదివారం రోజు కరీంనగర్ నుండి యాదగిరి గుట్టకు వెల్లేందుకు నూతన సూపర్ లగ్జరీ బస్సును సాంక్షన్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్, జనగాం మీదుగా ప్రతి రోజు 6 గంటలకు యాదగిరి గుట్టకు బయలు దేరనుంది. నూతన సూపర్ లగ్జరీ బస్సును సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బీసి సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నగర ప్రజలు, లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేస్కోవాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపు నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement