కరీంనగర్ – జిల్లాలలోని జమ్మికుంటలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు పర్యటించనున్న నేపద్యంలో ఆ ఏర్పాటు పూర్తి చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జమ్మికుంట లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను నేడు ఆయన పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుతో కలిసి సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ కేటీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తోపాటు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement