Tuesday, March 26, 2024

కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద..

రెండు రోజులుగా వాన‌లు త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద తగ్గుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 16,71,388 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అయితే అధికారులు ప్రాజెక్టు మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సరస్వతి (అన్నారం) బ్యారేజీకి 2,41,891 క్యూసెక్కుల వరద వస్తుండగా, 66 గేట్లు ఎత్తి మొత్తం నీటిని కిందికి వదులుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement