Friday, March 29, 2024

BIG BREAKING : గనిలో పేలుడు.. కార్మికుడు మృతి..

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో ఈరోజు పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్‌ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్‌ రాత్రి షిప్ట్‌లో సీహెచ్‌పీ సర్పేస్‌ ఫీడర్‌ ఫైర్‌ ఎక్సనెంజర్‌ వద్ద వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదవాశాత్తు గ్యాస్‌ పేలింది. ప్రమాదంలో కొత్తగూడెం మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన జైనాథ్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఏరియా హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు దృవీకరించారు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అలాగే ఓసీపీ త్రీ ఆర్జీ 2 ఏరియాలో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పల్లెనేని ప్రకాష్ రావు (59) అనే కార్మికుడు గుండెపోటుతో మరణించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆయన రాత్రి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తుండగా డిన్నర్‌ బ్రేక్‌లో నిద్రపోయాడు. అతడికి నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement