Sunday, March 24, 2024

చెక్ బౌన్స్ కేసులో ఎనిమిది నెలల జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో 8నెలల జైలుశిక్ష విధిస్తూ పెద్దపల్లి మున్సిఫ్ మేజిస్ట్రేట్ రాణి తీర్పునిచ్చారు. పెద్దపల్లికి చెందిన ఠాగూర్ రాజారాం సింగ్ కు ఐత రవి 2016లో ఐదు లక్షల 20 వేల రూపాయలకు చెక్కు ఇవ్వగా.. బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసును పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం మంగళవారం న్యాయమూర్తి రాణి బాధితుడు రాజారాం సింగ్ కు 6 లక్షల 50 వేల రూపాయలు చెల్లించాలని తీర్పుని ఇవ్వడంతో పాటు రవికి 8 నెలల జైలు శిక్ష విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement