Wednesday, April 24, 2024

దొడ్డి కొమురయ్య జయంతి..

ఓదెల: మండలంలోని అబ్బిడిపల్లి గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి ఓదెల మండల అధ్యక్షులు జింకిరి కత్తులు ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్‌ జింకిరి కోమల హాజరై మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వని డిమాండ్‌ చేసారు. ఈకార్యక్రమంలో ఓదెల మండల ప్రచార కార్యదర్శి జింకిరి శ్రీను, కుల పెద్ద జింకిరి సదయ్య, నాయకులు జింకిరి సంపత్‌, రవి, సదయ్య, రాజయ్య, బుచ్చయ్య, శ్రీను, రమేష్‌, అనిల్‌, సాహిత్‌, కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement