Wednesday, April 24, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని హరిదాస్‌నగర్‌, వెంకటాపూర్‌, బండలింగంపల్లిలో ఐకెపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా టిఆర్‌ ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటు-ందన్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, ఏ గ్రేడ్‌ మాయిశ్చర్‌ వచ్చేలా చూసుకొని ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలన్నారు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోకుండా రైతులు జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు తిరుపతి, మల్లేశం, టీఆర్ ఎస్ నాయకులు శంకర్‌, కిషన్‌తో పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement