Friday, April 26, 2024

అభివృద్ధే మా లక్ష్యం : మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతుంద‌ని, ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు అభివృద్ధికి ప్ర‌భుత్వం ప‌త్ర్యేక చొర‌వ తీసుకుంటుంద‌ని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని కొత్త యస్వాడ 17వ డివిజన్ లో 26 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాలు, గ్రామాల అభివృద్ధే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి – ప్రశాంత్, మునిసిపల్ అధికారులు, కార్పొరేటర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement