Thursday, March 28, 2024

దాసరి యువసేన ఆధ్వర్యంలో బియ్యం వితరణ..

కాల్వశ్రీరాంపూర్‌ : పెగడపల్లి గ్రామానికి చెందిన పంజాల కనకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన కనకయ్య మృతి చెందగా ఆయన కుటుంబానికి దాసరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్‌ రెడ్డి 50 కిలోల బియ్యం అందించారు. శనివారం బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు నూనేటి కుమార్‌ పంపిణీ చేశారు.పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిపై ఉన్న అభిమానంతో గత పది స ంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోరె సదయ్య, నేరె ళ్ల భరత్‌ కుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement